P Chidambaram: ఇంధన ధరల పెంపు.. కేంద్రం శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి
దేశంలో పెరిగిపోతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కేంద్రంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.....
దిల్లీ: దేశంలో పెరిగిపోతున్న ఇంధన ధరలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కేంద్రంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. 100 కోట్ల టీకా డోసులు ఇచ్చిన తర్వాత సంబురాలు చేసుకున్న విధంగానే.. ఇంధన ధరలు రూ.100 దాటిన సందర్భంగా కేంద్రం ‘శతాబ్ది ఉత్సవాలు’ జరుపుకోవాలంటూ వ్యంగ్యాస్త్రాలు విరిసారు. ‘దేశంలో 100 కోట్ల టీకా డోసులు పూర్తయిన తర్వాత సంబురాలు జరుపుకోవాలని మంత్రులకు మోదీ విన్నవించారు. అదేవిధంగా మరికొన్ని విషయాల్లోనూ ఉత్సవాలు జరుపుకోవాలని ప్రధాని పిలుపునివ్వాలి. దేశంలో కొద్దిరోజుల క్రితమే పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఇప్పుడు డీజిల్ రూ.100 మార్కును అందుకుంది. గ్యాస్ సిలిండర్ ధర రూ.1000కి చేరింది. ఈ విషయాల్లోనూ కేంద్రం సంబురాలు చేసుకోవాలి’ అంటూ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు 110 దాటగా, డీజిల్ ధర రూ.100 దాటింది. దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం పెట్రోల్ రేటు రూ.107.59 ఉంటే, డీజిల్ ధర రూ.96.32గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.113.46, డీజిల్ రేటు రూ.104.38గా కొనసాగుతోంది. గతేడాది మే (2020) నుంచి ఇప్పటివరకు పెట్రోల్పై దాదాపు రూ.36 పెరగగా డీజిల్పై రూ.26 పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.