Kejriwal: పంజాబ్కు బలమైన ప్రభుత్వం అవసరం :కేజ్రివాల్
చరణ్జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని పంజాబ్కు బలమైన ప్రభుత్వం అవసరమని ఆమ్ఆద్మీపార్టీ (ఏఏపీ)కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్..
పంజాబ్: చరణ్జిత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని పంజాబ్కు బలమైన ప్రభుత్వం అవసరమని ఆమ్ఆద్మీపార్టీ (ఏఏపీ)కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పేర్కొన్నారు. పంజాబ్లో నేడు కేజ్రివాల్ మీడియాతో మాట్లాడుతూ.. చన్నీ ప్రభుత్వంలోని అంతర్గత వివాదాలపై మండిపడ్డారు. పంజాబ్లో బలమైన, తక్షణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం అవసరమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలను ఖండించిన కేజ్రివాల్.. ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు లుథియానాలో జరిగిన పేలుడు ఘటన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రగా అనిపిస్తోందన్నారు. లుథియానా ఘటనకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి కుట్ర పూరిత ఘటనలను ఎవరూ కూడా ప్రోత్సహించవద్దని పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆప్ను గెలిపిస్తే రాష్ట్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేరాలకు పాల్పడిన సూత్రధారులను కఠినంగా శిక్షిస్తామని కేజ్రివాల్ తెలిపారు. ఆప్ అధికారంలోని వస్తే పంజాబ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా శస్ర్తచికిత్సలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.