Congress: భాజపానే దేశానికి అతిపెద్ద ఎన్పీఏ: కాంగ్రెస్
వ్యాపారస్థులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తూ.. కేంద్రం ప్రజల సొమ్మును వృథా చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశానికి అతి పెద్ద ఎన్పీఏ భాజపానే అని విమర్శించింది.
దిల్లీ: ఎన్డీయే హయాంలో దేశంలో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. వ్యాపారస్థుల రుణాలను మాఫీ చేస్తూ ప్రజల సొమ్మును కేంద్రం వృథా చేస్తోందని విమర్శించింది. తక్కువ ధరలకే ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు అపరిమిత అధికారాలు ఎందుకు కట్టబెట్టారో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బ్యాంకులకు రుణాలు ఎగవేసి పరారీలో ఉన్న 38 మందిని తిరిగి భారత్కు రప్పించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతుందని కాంగ్రెస్ ప్రశ్నించింది.
‘‘ భాజపా హయాంలో ఎన్పీఏలు 365 శాతం పెరిగాయి. భారత్కు ఉన్న అతి పెద్ద ఎన్పీఏ భాజపానే. గత ఐదేళ్లలో కేంద్రం ₹ 10 వేల కోట్ల విలువైన ఎన్పీఏలను తగ్గించుకుని, కేవలం వెయ్యి కోట్లు మాత్రమే వసూలు చేసింది. పెద్ద వ్యాపారస్థులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ.. ప్రజల సొమ్మును కేంద్రం వృథా చేస్తోంది. దీని వల్ల చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను తీవ్రంగా నష్టపోతున్నాయి’’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్ చేశారు.
‘‘సామాన్యుడు తీసుకున్న రుణాలకు వాయిదాలు చెల్లించకపోతే వారిని వేధింపులకు గురిచేసే బ్యాంకులు, వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన వారి వివరాలను ఎందుకు వెల్లడించడంలేదు’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా ష్రినాతే ప్రశ్నించారు. 2008-14 మధ్య కాలంలో ₹ ఐదు లక్షల కోట్లుగా ఉన్న ఎన్పీఏలు, 2014-20 మధ్య ₹ 18 లక్షల కోట్లకు పెరిగాయని అన్నారు. ప్రతి ఎన్నికల్లో పనితీరు ఆధారంగా కాకుండా, ప్రధాని మోదీని చూసి ఓటేయాలని కోరుతూ.. భాజపా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.