Eatala Jamuna: కలెక్టర్ ఆరోపణలన్నీ అసత్యం.. మాకున్నది 8.36 ఎకరాలే: ఈటల జమున
జమున హేచరీస్కు సంబంధించిన భూములను ఈటల రాజేందర్ బలవంతంగా ఆక్రమించుకున్నారంటూ కలెక్టర్ హరీశ్ అసత్య ఆరోపణలు
హైదరాబాద్: జమున హేచరీస్కు సంబంధించిన భూములను ఈటల రాజేందర్ బలవంతంగా ఆక్రమించుకున్నారంటూ కలెక్టర్ హరీశ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈటల సతీమణి జమున ఆరోపించారు. సోమవారం షామీర్పేటలో ఆమె విలేకరులతో మాట్లాడారు. మెదక్ జిల్లాలోని అచ్చంపేట, హకీంపేటలలో ఈటెల రాజేందర్కు చెందిన జమున హేచరీస్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ పేర్కొన్న నేపథ్యంలో ఆమె స్పందించారు.
‘‘జమున హేచరీస్ భూములపై కలెక్టర్ హరీశ్ ప్రెస్మీట్ పెట్టారు. ఈ విషయంలో విలేకరుల సమావేశం పెట్టడానికి ఆయనకు ఏం అధికారం ఉంది? ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాం. వాళ్లు వచ్చి మళ్లీ సర్వే చేశారు. వాటికి సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాలి. ‘మీ భూమి ఇదే. ఇంతే ఉంది’ అని కనీసం మాకు ఒక కాపీ ఇవ్వాలి. మాకు ఎలాంటి వివరాలు చెప్పలేదు. ఈ రోజు నేరుగా విలేకరుల సమావేశం పెట్టి, భూములు ఆక్రమించుకున్నారంటూ కలెక్టర్ ఆరోపిస్తున్నారు. కలెక్టర్ ఏమైనా రాజకీయ నాయకుడా? తెరాస ప్రభుత్వానికి క్లర్క్గా పనిచేస్తున్నారా? ఈ విషయమై ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఎలాంటి సమస్యలు లేని భూములే ధరణిలోకి ఎక్కుతాయని గతంలో సీఎం కేసీఆర్ చెప్పారు. 2019లో అలాంటి భూములనే మేము కొనుగోలు చేశాం. మొత్తంగా మాకున్నదే 8.36 ఎకరాలు. కలెక్టర్ చెప్పిన 70 ఎకరాలతో మాకు సంబంధం లేదు. ఆక్రమణకు సంబంధించిన ఆరోపణలు ఉంటే ఈ రెండేళ్లు ఏం చేశారు? ఇది కచ్చితంగా వ్యక్తిగత కక్ష సాధింపు చర్యల కిందకే వస్తుంది. రాజకీయంగా ప్రత్యర్థి అయితే, అలాగే ఎదుర్కొవాలి. ఈటల రాజేందర్ 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ అధికారికైనా ఫోన్లు చేశారా? అధికారులకు ఫోన్లు చేసి భూములు ఆక్రమించుకున్నారా? గతంలో లేనిది ఇప్పుడే ఆక్రమించుకున్నారని ఎందుకు చెబుతున్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే ఈ ప్రభుత్వం ఒక మహిళా వ్యాపారవేత్త మీద దాడి చేయటం సరైన పద్ధతి కాదు’’ అని జమున మండిపడ్డారు.
ఇంతకీ కలెక్టర్ ఏమన్నారంటే...!
ఈటల రాజేందర్ భూఅక్రమాల ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ నివేదిక రూపొందించారు. గత మేలోనే భూములను సర్వే చేసి నివేదిక సిద్ధం చేయగా.. అధికారులు సహజ న్యాయ సూత్రలకు విరుద్ధంగా వ్యవహరించారని ఈటల వర్గం హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ఈటల రాజేందర్ భార్య జమున, కొడుకు నితిన్ రెడ్డిలతో పాటు అచ్చంపేట, హకీంపేట గ్రామాల చెందిన 156మందికి నోటిసులు జారీ చేశారు. గత నెల 16వ తేదీ నుంచి సుమారు 15రోజుల పాటు పునః సర్వే నిర్వహించారు. అచ్చంపేట గ్రామ పరధిలోని 77, 78, 79, 80, 81, 82, 130, హకీంపేట పరిధిలోని 97, 111 సర్వే నెంబర్లలో సర్వే నిర్వహించారు. జమున హేచరీస్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నట్లు ఈ రోజు ఉదయం కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. ఈ రెండు గ్రామాల పరిధిలో 70.33ఎకరాల భూమి అక్రమించుకున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు జమున హేచరీస్ వివిధ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డట్టు ఆయన తన నివేదకలో పేర్కొన్నారు. అంతేకాదు, జమునా హేచరీస్ వల్ల వాతవరణ కాలుష్యం ఏర్పడిందని తెలిపారు. కోళ్ల వ్యర్థాల వల్ల స్థానికంగా ఉన్న ఎల్కం చెరువు నీరు, భూగర్భ జలాలు, గాలి కలుషితమైందని.. దుర్వాసన సైతం వస్తోందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కలెక్టర్ కు నివేదిక ఇచ్చారు. అచ్చంపేట గ్రామంలోని 81, 130 సర్వే నెంబర్లలో ఉన్న భూములు నిషేధిత జాబితాలో ఉన్నా.. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. నిబంధలకు విరుద్ధంగా జరిగిన ఈ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామన్నారు.
► Read latest Political News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!