Eatala Jamuna: మేం కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం: ఈటల జమున

తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున అన్నారు.

Updated : 30 Jun 2022 16:36 IST

హైదరాబాద్‌: తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున అన్నారు. కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రేపు సీఎం కేసీఆర్‌ అధికారులను తీసుకొని రావాలని.. తాము భూములు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు. తమ భూమి సర్వే నంబర్లు.. నిన్న ఇచ్చిన సర్వే నంబర్లకు పొంతన లేదని చెప్పారు. కేసీఆర్‌ కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఈటల జమున ఆరోపించారు. తాము ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నామన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని