Kiran Kumar Reddy: భాజపాలో చేరిన మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్కుమార్ రెడ్డి భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ పార్టీ ముఖ్యనేతలు అరుణ్సింగ్, లక్ష్మణ్ సమక్షంలో శుక్రవారం ఆయన కాషాయ కండువా వేసుకున్నారు.
దిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నల్లారి కిరణ్కుమార్రెడ్డి భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ పార్టీ ముఖ్యనేతలు అరుణ్సింగ్, లక్ష్మణ్ సమక్షంలో శుక్రవారం ఆయన కాషాయ కండువా వేసుకున్నారు. కిరణ్కుమార్రెడ్డి భాజపాలో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారని.. దీంతో ఏపీలో తమ పార్టీ బలోపేతం అవుతుందని ప్రహ్లాద్ జోషి చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్కుమార్రెడ్డి వివిధ పదవులు చేపట్టారు. 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి 1 వరకు సీఎంగా ఆయన పనిచేశారు. అంతకుముందు శాసనసభ స్పీకర్గా, ప్రభుత్వ చీఫ్ విప్గా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కిరణ్కుమార్రెడ్డి పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. తిరిగి కాంగ్రెస్లో చేరారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్కు రాజీనామా చేసిన కిరణ్కుమార్రెడ్డి.. ఇప్పుడు భాజపా తీర్థం పుచ్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
సీఎం రేవంత్రెడ్డికి భాజపా ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. పోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ కోరాలని అందులో పేర్కొన్నారు. -
వారు తిరస్కరణ మోడ్లో ఉన్నారు: భాజపా
తాము ఎన్నడూ మీడియా, ఎగ్జిట్ పోల్స్ (Exit Polls)ను బాయ్కాట్ చేయలేదని, కాంగ్రెస్ కూడా పారిపోకుండా ఓటమిని ధైర్యంగా ఎదుర్కోవాలని భాజపా అగ్రనేత అమిత్ షా (Amit shah) సూచించారు. -
జగన్కు ఘోర పరాభవం తప్పదు: కె.నారాయణ
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోవడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. శుక్రవారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఉద్యోగాలమ్ముకుంటున్న ఎంపీ వంగా గీత: మాజీ ఎమ్మెల్యే వర్మ
కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రిలో తాత్కాలిక ఉద్యోగాలను ఎంపీ వంగా గీత అమ్ముకుంటున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. -
సినిమా థియేటర్లలో లోక్సభ ఎన్నికల ఫలితాలు!
సార్వత్రిక ఎన్నికల సందడి ముగింపు దశకు చేరుకుంది. శనివారం చివరి విడత పోలింగ్ పూర్తికాగానే ఫలితాల కోసం ఉత్కంఠ కొనసాగుతుంది. -
ఎవరిదో విజయ మార్గం
దేశ తూర్పు ప్రాంతంలోని రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో చివరిదైన నాలుగో విడత పోలింగ్ శనివారం జరగనుంది. ఈ విడతలో కేంద్రపాడా, జాజ్పుర్, జగత్సింగ్పుర్ భద్రక్, బాలేశ్వర్, మయూర్ భంజ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. -
నేడే తుది విడత
రాబోయే ఐదేళ్లపాటు దేశ గమనాన్ని నిర్దేశించే సార్వత్రిక సమరంలో తుది విడతకు రంగం సిద్ధమైంది. ఏడో దశలో భాగంగా 57 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరగనుంది. -
ఎగ్జిట్పోల్స్ చర్చల్లో పాల్గొనం: కాంగ్రెస్
సార్వత్రిక ఎన్నికలపై శనివారం వెలువడబోతున్న ఎగ్జిట్పోల్స్పై టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొనరాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. -
మోదీకి వివేకానందుడి ‘షికాగో’ బోధనలు తెలుసా?
కన్యాకుమారిలోని వివేకానంద స్మారకం వద్ద ధ్యానంలో ఆసీనుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికాలోని షికాగో సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు చేసిన చారిత్రక బోధనల గురించి తెలుసా? అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శుక్రవారం ప్రశ్నించారు. -
కొత్త ఎంపీల స్వాగతానికి ముమ్మర సన్నాహాలు
పద్దెనిమిదో లోక్సభకు కొత్తగా ఎన్నికయ్యే సభ్యులకు స్వాగతం పలికేందుకు పార్లమెంటు హౌస్ ఎనెక్స్ సన్నద్ధమైంది. వారందరికీ అధికారిక నివాసాలు కేటాయించేవరకూ వెస్ట్రన్ కోర్టులో వసతి కల్పించనున్నారు. -
ప్రధానిగా రాహులే నా అభిమతం: ఖర్గే
ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రిగా రాహుల్గాంధీ ఉండాలనేదే తన అభిమతమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. -
కేటీఆర్, జగదీశ్రెడ్డిలపై కేసు
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, కేటీఆర్ పీఏ రమేశ్బాబులపై మేడిపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ఎవరూ కాపాడలేరు
ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి మాజీ సీఎం కేసీఆర్ను ఎవరూ కాపాడలేరని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
ఓటరు నాడిపై ఎవరేం చెబుతారో!
అసలు కంటే కొసరు ఎక్కువైనట్లు... ఓట్ల పండగలో ఆఖరి అంకం ఫలితాల వెల్లడే అయినా...అంతకుముందే అంతకంటే ఎక్కువ ఉత్కంఠ రేకెత్తించే ఘట్టం ఎగ్జిట్పోల్స్! -
సజ్జలపై క్రిమినల్ కేసు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసు నమోదైౖంది. -
కౌంటింగ్లో తేడాలొస్తే లిఖితపూర్వక ఫిర్యాదు చేయండి
బ్యాలట్ యూనిట్కు సంబంధించిన ముఖ్యమైన సీళ్లు తారుమారైనట్టు గుర్తిస్తే.. ఆ ఈవీఎం లెక్కింపునకు అభ్యంతరం తెలపాలని ప్రధాన కౌంటింగ్ ఏజెంట్లకు తెదేపా నేతలు సూచించారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్ దృష్టికి తీసుకెళ్లారు. -
పిన్నెల్లి అరాచకాలకు తోడున్న అధికారికి కౌంటింగ్ విధులా?
వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టిన ఘటన వెలుగులోకి రాకుండా విశ్వప్రయత్నాలు చేసిన పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్రెడ్డిని కౌంటింగ్ విధుల్లో నియమించడం ఏంటని తెదేపా నేతలు ప్రశ్నించారు. -
పోస్టల్ బ్యాలట్ అంటే వైకాపాకు ఎందుకు భయం?
పోస్టల్ బ్యాలట్ అనగానే వైకాపా నాయకులు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు నిలదీశారు. -
జుట్టు పట్టి ఈడ్చి.. గుండెలపై తన్ని!
‘నీవు నీ కుటుంబ సభ్యులను మార్చేశావు. అందరితో సైకిల్ గుర్తుకు ఓటు వేయించావు. ఇప్పుడు ఒంటరిగా దొరికావు. -
చెవిరెడ్డి బెదిరింపులకు తలొగ్గలేదనే ఆర్వో బదిలీ
ఒంగోలు లోక్సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు తలొగ్గనందుకే యర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను బాధ్యతల నుంచి తప్పించారని ఆ నియోజకవర్గ తెదేపా పరిశీలకుడు వేములకొండ శ్రీనివాస్ విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
-
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
-
‘వెంటనే ఆ ఫొటో డిలీట్ చేయండి’: నెటిజన్పై ఎస్బీఐ ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మూడేళ్లు ఆడగలిగే ఫిట్నెస్ ఉన్నా.. ఐపీఎల్కు వీడ్కోలు పలికేందుకు డీకే కారణమిదే!
-
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కింపు: జీహెచ్ఎంసీ కమిషనర్