స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రానికి గల్లా లేఖ

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ కేంద్రాన్ని కోరారు. ..

Updated : 06 Feb 2021 15:31 IST

అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు విడివిడిగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంస్థ కార్మికులనే కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం కోసం ఎంతో మంది త్యాగం చేశారని, ప్రజల పోరాటం ద్వారా ఈ ప్రాజెక్టు వచ్చిందని గుర్తుచేశారు.

మొత్తం ఉక్కు రంగమే అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటోందని, మార్కెట్‌ ఒత్తిడిని ఎదుర్కోలేకపోతోందని గల్లా జయదేవ్‌ అభిప్రాయపడ్డారు. ఒక్క విశాఖ ప్రాజెక్టుకే ఇది వర్తించదని జయదేవ్‌ అన్నారు. ఆర్థిక మందగమనం ఉన్న తరుణంలో ఇలాంటి సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఆర్థిక రంగానికి మంచిది కాదన్నారు. ప్రైవేటుపరం చేయడానికి బదులు కర్మాగారానికి ప్రత్యేక గనులు కేటాయించాలని కోరారు. సంస్థ రుణాలను ఈక్విటీలుగా, ప్రాధాన్యత షేర్లుగా మర్చేలా చేయడం ద్వారా అప్పుల ఊబి నుంచి బయటపడేలా చేయాలని కేంద్ర మంత్రులను కోరారు.

ఇవీ చదవండి..

అలాంటి అధికారులకు బ్లాక్‌లిస్టే: మంత్రి పెద్దిరెడ్డి ప్రైవేటీకరణ నిర్ణయం ఒక్కరోజుది కాదు: సుజనా

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని