అనురాగ్ ఠాకూర్, వర్మపై ఈసీ నిషేధం
ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, భాజపా ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మలను ఎన్నికల ప్రచార తారల జాబితా నుంచి తొలగించాలని ఆదేశించిన ఈసీ తాజా వారిపై...
దిల్లీ: ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, భాజపా ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మలను ఎన్నికల ప్రచార తారల జాబితా నుంచి తొలగించాలని ఆదేశించిన ఈసీ తాజాగా వారిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకొంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రానున్న 72 గంటలపాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇక మరో ఎంపీ పర్వేశ్ వర్మపై 96 గంటలపాటు నిషేధం విధించింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగసభలో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని, ప్రతిపక్షాలను దేశద్రోహులుగా ఆరోపించారు. వారిపై తూటాలు పేల్చండి అంటూ వివాదాస్పదంగా మాట్లాడారు. ఠాకూర్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీంతో ఈసీ ఆయనపై చర్యలు తీసుకుంటూ అనురాగ్ ఠాకూర్ ప్రచారంపై నిషేధం విధించింది. ఇక మరో ఎంపీ పర్వేశ్ వర్మ కూడా ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ షహీన్బాగ్ ఆందోళనకారులపై వివాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘షహీన్బాగ్ ఆందోళకారులు ఇళ్లలోకి చొరబడి ఆత్యాచారాలు, హత్యలు చేస్తారు’’ అని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయనపై కూడా నిషేధం విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!