దిల్లీలో కాంగ్రెస్కు రిక్త హస్తం
దిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడగానే ఖండించిన దిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు అవే ఫలితాలను చూస్తూ మౌనాన్ని ప్రదర్శిస్తోంది. కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వికాస్పూరి కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ శర్మ తన ఓటమిని అంగీకరించాడు.
దేశ రాజధానిలో మరింత దిగజారిన కాంగ్రెస్
దిల్లీ: ఎగ్జిట్పోల్స్ అంచనా వేసినట్లుగానే దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. తొలుత ఎగ్జిట్పోల్స్పై విరుచుకుపడిన ఆ పార్టీ ఇప్పుడు ఫలితాలను చూసి మౌనంగా ఉండిపోయింది. కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వికాస్పూరి కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ శర్మ తన ఓటమిని అంగీకరించడం విశేషం. 2015 ఎన్నికల ఫలితాలే ఇప్పుడు కూడా పునరావృతమవుతున్నాయని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నాడు.
అయితే గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో భాజాపా పుంజుకోగా కాంగ్రెస్ మాత్రం అదే స్థితిలో కొనసాగుతోంది. 15 సంవత్సరాలు ఏకధాటిగా రాష్ట్రాన్ని పాలించిన షీలాదీక్షిత్ వంటి నాయకులు ఇప్పుడు స్థానికంగా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం అయ్యింది. 2013లో దాదాపు 24శాతం ఓటు షేర్ ఉన్న కాంగ్రెస్ 2015 వచ్చేసరికి దాదాపు 10శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఫలితాలను విశ్లేషిస్తే మాత్రం ఈ సారి మరింత దిగజారే పరిస్థితి కనిపిస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వెంటనే స్పందించిన కాంగ్రెస్.. ఈసారి కూడా ఆమ్ఆద్మీ పార్టీదే విజయమని అంచనా వేస్తున్నట్లు అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. తాము కావాలనే ఎన్నికల్లో భారీగా ప్రచారం చేయలేదని..ఒకవేళ అలా చేస్తే ఓట్లు చీలిపోయి పరిస్థితి బీజేపీ అనుకూలంగా మారే అవకాశం ఉందని తెలపడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.