పోటీ నుంచి అందుకే తప్పుకొంటున్నారు: బొత్స
రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడా చెప్పుకోదగ్గ ఘటనలు జరగలేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అభ్యర్థుల
అమరావతి: రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలు తప్ప ఎక్కడా చెప్పుకోదగ్గ ఘటనలు జరగలేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అభ్యర్థుల మధ్య విభేదాల వల్లే చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయన్న ఆయన.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఇందుకు పెద్ద ఎత్తున దాఖలైన నామినేషన్లే తార్కారణమని పేర్కొన్నారు. మాచర్ల దాడి ఘటనకు తెదేపా నేతల చర్యలే కారణమని విమర్శించారు. ఈ దాడి ఘటనలో ఇద్దరిపై నాన్బెయిలబుల్ కేసు పెట్టినట్టు తెలిపారు. సున్నిత ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తమ పార్టీ విధానాలు నచ్చి కొందరు పోటీ నుంచి తప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం నేటితో ముగిసింది. అనేక చోట్ల అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ తీరును నిరసిస్తూ ఈ ఎన్నికలను విపక్ష పార్టీలు బహిష్కరించాయి. కడప జడ్పీ పీఠాన్ని వైకాపా కైవసం చేసుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.