ఆర్థికసాయం నిధులు రాష్ట్ర ప్రభుత్వానివే:అంబటి
కరోనా వ్యాప్తితో ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. సామాన్యుడు బయటకు రాలేని పరిస్థితుల్లో పేదలకు నిత్యావసరాలతో పాటు
తాడేపల్లి: కరోనా వ్యాప్తితో ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. సామాన్యుడు బయటకు రాలేని పరిస్థితుల్లో పేదలకు నిత్యావసరాలతో పాటు రూ.వెయ్యి ఆర్థికసాయం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని.. దీనిపైనా విమర్శలు సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయానికి సీఎం జగన్ స్టాంప్ వేసుకుని పంచుతున్నారంటూ భాజపా నేతలు చేస్తోన్న ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ఆ నిధులు ప్రధాని మోదీ, జగన్వి కాదని.. ప్రజలవేనని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ప్రజలకు పంపిణీ చేస్తున్న రూ.వెయ్యి ఆర్థిక సాయం నిధులు రాష్ట్ర ప్రభుత్వానివే అని ఆయన స్పష్టం చేశారు. దీనిపై జీవో సైతం విడుదలైందని చెప్పారు.
ప్రజల్ని ఆదుకోవాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రజల్లో ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతో బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. వాలంటీర్లు అవినీతికి పాల్పడినట్లు ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారని.. అదే నిజమైతే సాక్ష్యాధారాలతో రుజువు చేస్తే కచ్చితంగా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నగదు పంపిణీ సమయంలో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెబుతున్నారంటూ వాలంటీర్లపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధికారం కోసం తెదేపా నేతలు అర్రులు చాస్తున్నారని అంబటి విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.