తెదేపా ఎవరికీ భయపడదు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం రెండో రోజు ఎన్టీఆర్కు ఘన నివాళులతో ప్రారంభమైంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు...
అమరావతి: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం రెండో రోజు ఎన్టీఆర్కు ఘన నివాళులతో ప్రారంభమైంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుష్పాంజలి ఘటించారు. సీనియర్ నేతలు, ఇతర నాయకులు నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడు రెండో రోజు వేడుకను చంద్రబాబు ప్రారంభించారు.
తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని మహానాడు వేదికగా తెలుగుదేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వ్యక్తికాదు.. వ్యవస్థ అని కొనియాడారు. ఆయన జీవితం ఆదర్శమని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పిలుపునిచ్చారు. తెలుగుదేశం ఎవరికీ భయపడదని తేల్చిచెప్పిన చంద్రబాబు.. సవాళ్లు పార్టీకి కొత్తకాదని స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీకి శక్తి అని, వారి శక్తి యుక్తులతో మరింత ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఎప్పుడు ఎక్కడ అసరముంటే అక్కడ ప్రత్యక్షమవుతానని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన..చంద్రబాబు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో తీర్మానం ప్రవేశ పెట్టగా.. ఆ అంశంపై బాలకృష్ణ ప్రసంగించారు. తెలుగుజాతికి ఎన్టీఆర్ చేసిన సేవలను సీనియర్ నేతలు అశోక్గజపతిరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM