ఏ ఒక్కరూ పస్తులతో నిద్రపోవద్దనే..
దేశంలో ఏ ఒక్కరూ పస్తులతో పడుకోకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను నవంబర్ వరకు పొడగించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు....
గరీబ్ కల్యాణ్ అన్న యోజన పొడగించిన మోదీ: జావడేకర్
దిల్లీ: దేశంలో ఏ ఒక్కరూ పస్తులతో పడుకోకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ అన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను నవంబర్ వరకు పొడగించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అన్లాక్ తొలి దశ ముగిసి రెండో దశలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. పండుగల సీజన్ ఆరంభమవ్వడం, కరోనా వైరస్ నుంచి విముక్తి లభించకపోవడంతో ఉచిత రేషన్ పథకాన్ని దీపావళి లేదా నవంబర్ వరకు పొడగిస్తున్నామని తెలిపారు. 80 కోట్ల మందికి 5 కిలోల బియ్యం, గోధుమలు, కిలో కందిపప్పు చొప్పున ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ.90వేల కోట్లు ఖర్చుచేయనున్నామని వెల్లడించిన సంగతి తెలిసిందే.
‘80 కోట్ల మంది ప్రజలు. అంటే 16 కోట్ల కుటుంబాలు. 25 కిలోల బియ్యం, 5 కిలోల పప్పు రాబోయే ఐదు నెలలు ఉచితంగా పొందుతారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇలాంటి ఆహార భద్రతా పథకం లేదు. ఇది అందరి ఆహార అవసరాలను తీరుస్తుంది’ అని జావడేకర్ అన్నారు. ఈ పథకంతో దేశంలో ఎవ్వరూ ఆకలితో పస్తులుండరని ఆయన పేర్కొన్నారు. పీఎంజీకేఏవై పథకాన్ని పొడగించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందేనన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే