సెంట్రల్ విస్టా కంటే.. మౌలిక వసతులపై దృష్టి సారించాలి
కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కాకుండా.. దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాల్సిందని భారాస తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ట్విటర్లో పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత
ఈనాడు, హైదరాబాద్: కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కాకుండా.. దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాల్సిందని భారాస తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ట్విటర్లో పేర్కొన్నారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా.. రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే భారాస పోరాడుతోందన్నారు. ‘కేసీఆర్ రోజూ ప్రశ్నిస్తున్న వాటినే గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక రోజున గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో మళ్లీ అడిగినందుకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.
గవర్నర్ విమర్శలు దారుణం: కార్పొరేషన్ల ఛైర్మన్లు
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా గవర్నర్ మాట్లాడారని రాష్ట్ర వైద్యఆరోగ్యమౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, రెడ్కో, చలనచిత్ర అభివృద్ధి సంస్థ, టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, సతీశ్రెడ్డి, అనిల్ కూర్మాచలం, రాజీవ్ సాగర్ విమర్శించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కేంద్రం ప్రశంసిస్తుంటే.. గవర్నర్ మాత్రం విమర్శలు చేయడం దారుణం. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా రాజ్యాంగబద్ధ హోదాలో తన గౌరవాన్ని కాపాడుకోవాలి’’ అని వారు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే