రాష్ట్ర అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయ్
రాష్ట్ర అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తంచేశారు.
అత్యధిక ధరలు తెలంగాణలోనే
ఈటల రాజేందర్ ధ్వజం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర అప్పులు అంతకంతకూ పెరుగుతున్నాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తంచేశారు. జీడీపీలో కేంద్ర అప్పుల నిష్పత్తి 2014-15 నుంచి, గత ఏడాదికి సుమారు 1.4 శాతం తగ్గగా, అదే కాల వ్యవధిలో తెలంగాణ అప్పులు జీఎస్డీపీలో 15 శాతం నుంచి 28.8 శాతానికి పెరిగాయన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టకుండా వాస్తవాలతో ఉందన్నారు. గురువారం రాష్ట్ర భాజపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి ఈటల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో ధరలు అత్యధికంగా పెరిగాయని, దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఇక్కడ ఉండటమే దానికి నిదర్శనమన్నారు. తెరాస ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రతి వ్యక్తిపై అప్పుల భారాన్ని రూ.1.2 లక్షలకు పెంచిందని ఆరోపించారు. రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థితిలోనూ లేదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు ఎక్కడ ఇస్తున్నారో నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని పునరుద్ఘాటించారు. సీఎం కేసీఆర్ రూ.30 లక్షల రైతుబంధు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. పెరిగిన ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని సీఎంను ప్రశ్నించారు.
అసహనంతోనే ఈటల వ్యాఖ్యలు: భానుప్రసాద్
భాజపా చేరికల కమిటీ అధ్యక్షుడిగా విఫలమైనందునే ఈటల రాజేందర్ అసహనంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని భారాస ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రం అప్పులు ఉత్పాదక రంగం కోసమేనన్నారు. కేంద్రం అప్పులు తెచ్చి ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే