అక్బరుద్దీన్తో కాంగ్రెస్ నేతల భేటీ
ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీతో కాంగ్రెస్ నేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డిలు లాబీలో ఆయనతో సమావేశమయ్యారు.
అసెంబ్లీ లాబీలో సమావేశం
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చ
గాంధీభవన్, న్యూస్టుడే: ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీతో కాంగ్రెస్ నేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డిలు లాబీలో ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. విశ్వసనీయ సమాచారం మేరకు..‘భాజపాకు ఎంఐఎం బీటీమ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్తున్నాం. దేశంలో, రాష్ట్రంలో భాజపా అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆ పార్టీ పూర్తిగాఓటు బ్యాంకును పోలరైజ్ చేస్తోంది. మేము మా వర్గానికి అండగా ఉంటాం’అని అక్బరుద్దీన్ కాంగ్రెస్ నేతలతో అన్నట్లు తెలిసింది. ‘మీరు మీ వర్గానికి అండగా ఉంటూ ఆ ఓట్లు చీల్చాలనేదే భాజపా ఎజెండా కదా’! అని శ్రీధర్బాబు అభిప్రాయపడగా, ‘ఎవరు ఏమనుకున్నా..వచ్చే ఎన్నికల్లో మేము తెలంగాణలో పార్టీని మరింత విస్తరిస్తాం’అని అక్బరుద్దీన్ అన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.