అప్పురత్న హయాంలో అభివృద్ధి మరచిపోవడమే: మనోహర్
అప్పులపై రోజుకు రూ.65కోట్ల వడ్డీ కడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే.. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు.
ఈనాడు, అమరావతి: అప్పులపై రోజుకు రూ.65కోట్ల వడ్డీ కడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే.. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. అప్పురత్నగా మారిన జగన్రెడ్డి పాలనలో అభివృద్ధి అనే మాటను మరచిపోవచ్చని విమర్శించారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం సగటున రోజుకు రూ.205 కోట్ల అప్పు తెస్తున్న మాట వాస్తవం. బహిరంగ మార్కెట్ రుణాలు, కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ హామీతో తెచ్చేవి కలిపితే ఇది రూ.500 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. రోజూ వందలకోట్ల అప్పులు చేస్తున్నా, ప్రభుత్వోద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ నెలలోనూ ఒకటో తేదీన జీతం అందుకోలేకపోతున్నారు’ అని ఒక ప్రకటనలో విమర్శించారు. ‘ఏ పని చేసినా బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు టెండర్లు వేయట్లేదు, రోడ్ల పనులు చేయట్లేదు. సాగునీటి ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి. రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వరు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కాదు, అభివృద్ధి లేదు. సంక్షేమ కార్యక్రమాలూ అమలు కావట్లేదు’ అని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.