అదానీ వ్యవహారంలో సమాధానం చెప్పలేకే సభల వాయిదా..
అదానీ వ్యవహారంలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేకనే ఉభయ సభలను వాయిదా వేస్తున్నారని భారాస ఎంపీలు విమర్శించారు. హిండెన్బర్గ్ నివేదికపై చర్చను చేపట్టాలంటూ పార్లమెంటు ఉభయసభల్లో భారాస ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతులు సోమవారం తిరస్కరించారు.
కేంద్రంపై భారాస ఎంపీల విమర్శలు
ఈనాడు, దిల్లీ: అదానీ వ్యవహారంలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేకనే ఉభయ సభలను వాయిదా వేస్తున్నారని భారాస ఎంపీలు విమర్శించారు. హిండెన్బర్గ్ నివేదికపై చర్చను చేపట్టాలంటూ పార్లమెంటు ఉభయసభల్లో భారాస ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతులు సోమవారం తిరస్కరించారు. సభల వాయిదా అనంతరం ఇతర విపక్ష పార్టీల సభ్యులతో కలిసి భారాస ఎంపీలు విజయ్చౌక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అదానీ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై వెంటనే సంయుక్త పార్లమెంటరీ బృందంతో విచారణ చేయించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అదానీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు పార్లమెంటును వాయిదా వేసుకుంటూ వెళుతోందన్నారు. ప్రతిపక్షాల ఆందోళనను పట్టించుకోకుండా సభను వాయిదావేస్తూ తానే ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్న వింత పరిస్థితి నెలకొందని విమర్శించారు. దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరును దేశ ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభాపక్ష ఉప నేత కొత్త ప్రభాకర్రెడ్డి, ఎంపీలు గడ్డం రంజిత్రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, మన్నె శ్రీనివాస్రెడ్డి, పి.రాములు, కేఆర్ సురేశ్రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.