ఐటీ నాకు క్లీన్ చిట్ ఇచ్చింది
తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఆదాయపు పన్ను విభాగం క్లీన్ చిట్ ఇచ్చిందని, దర్యాప్తును అప్పుడే ముగించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజేశ్ కిలారు పేర్కొన్నారు.
తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి రాజేశ్ కిలారు
ఈనాడు, అమరావతి: తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఆదాయపు పన్ను విభాగం క్లీన్ చిట్ ఇచ్చిందని, దర్యాప్తును అప్పుడే ముగించిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజేశ్ కిలారు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను సోదాల్లో గానీ, తర్వాత ఇచ్చిన నోటీసుల్లోగానీ తనకు ఈ వ్యవహారాల్లో ఎలాంటి సంబంధం లేదని తేల్చి దర్యాప్తును ముగించారని వివరించారు. తన చిత్తశుద్ధి, నిజాయతీకి ఇదే నిదర్శనమన్నారు. ‘ఆదాయపు పన్ను విభాగం సోదాల్లో భాగంగా ఏడేళ్ల ఆదాయపు పన్ను రిటర్న్లను పరిశీలించి రీఅసెస్మెంట్ చేశారు. ఆరేళ్ల రిటర్న్లను ఆమోదించారు. ఒక్క ఏడాదిలో మాత్రం పూర్వీకుల నుంచి వచ్చి వ్యవసాయ భూమి అమ్మకంపై క్యాపిటల్ గెయిన్స్ పూర్తిగా కట్టలేదని నోటీసులు ఇచ్చారు. అది వ్యవసాయ భూమి అని, క్యాపిటల్ గెయిన్స్ వర్తించదని అప్పీల్ చేశాను. ఈ వ్యవహారం తప్పించి ఐటీ విభాగం నాపై ఎలాంటి ఆరోపణ చేయలేదు’ అని శనివారం విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ‘వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాపై అక్రమ కేసులు బనాయించడానికి ప్రయత్నిస్తోంది. తప్పుడు ఆరోపణలతో ఐటీ దాడులు చేయించారు. రాజకీయ ప్రయోజనాల కోసం నా వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సాక్షిలో ప్రచారం చేస్తున్నారు. శాసనసభలో చేయని ఆరోపణలను కూడా చేసినట్లు ప్రచురించినందుకు లీగల్ నోటీసులు పంపిస్తున్నాను’ అని రాజేశ్ కిలారు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.