YSRCP - TDP: ఫ్లెక్సీ కట్టారని.. దుకాణం కూల్చేశారు!
గతంలో విశాఖ, అమరావతి ప్రాంతాల్లో కలకలం రేపిన జేసీబీ సంస్కృతి ఇప్పుడు పల్లెలకూ పాకింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఆరుగొలనులో తెదేపా నాయకుడు మాదల శ్రీనివాసరావుకు చెందిన దుకాణ భవనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం ఇలాగే నేలమట్టం చేశారు.
ఆక్రమణలో ఉందని తెదేపా నాయకుడి దుకాణం నేలమట్టం
రాజకీయ కక్ష సాధింపేనన్న తెదేపా నాయకులు
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే: గతంలో విశాఖ, అమరావతి ప్రాంతాల్లో కలకలం రేపిన జేసీబీ సంస్కృతి ఇప్పుడు పల్లెలకూ పాకింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఆరుగొలనులో తెదేపా నాయకుడు మాదల శ్రీనివాసరావుకు చెందిన దుకాణ భవనాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం ఇలాగే నేలమట్టం చేశారు. ఉదయం జేసీబీతో దుకాణం వద్దకు వెళ్లిన అధికారులు.. ప్రహరీని కూల్చివేశారు. సత్వరమే భవనాన్ని ఖాళీ చేయకుంటే పూర్తిగా కూల్చివేస్తామంటూ హెచ్చరించారు. ఒక్కరోజైనా గడవకముందే అనూహ్యంగా రాత్రి 10 గంటల సమయంలో మరోసారి వచ్చి మొత్తం దుకాణాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. కూల్చివేత సమయంలో ఎవరూ అటుగా రాకుండా పోలీసు బందోబస్తు పెట్టారు. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటనలో ఆయనకు స్వాగతం పలుకుతూ శ్రీనివాసరావు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ కారణంగానే ఎమ్మెల్యే వర్గీయులు.. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి కూల్చివేయించారని, ఇది రాజకీయ కక్షసాధింపేనని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.
కూల్చే ముందే నోటీసులు
తిప్పనగుంట సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మాదల శ్రీనివాసరావు ఆరుగొలను హైస్కూల్ ఎదురుగా ఉన్న నాలుగు సెంట్ల స్థలంలో అయిదేళ్ల కిందట ఈ భవనం నిర్మించారు. అందులో ఆదిత్య ట్రేడర్స్ పేరుతో పురుగుమందుల దుకాణం నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సర్వే నంబర్లు 313, 336ల్లో ఉన్న ఈ స్థలం వాగు, రోడ్డు పోరంబోకుగా ఉందని, దీనిని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించినట్లు ఫిర్యాదులు వచ్చాయని బాపులపాడు తహసీల్దార్ నరసింహారావు తెలిపారు. దీంతో సత్వరమే భవనాన్ని తొలగించాలంటూ గత నెల 24న ఒకసారి, ఈ నెల 1న మరోసారి శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేశామని, అయినా స్పందించకపోవడంతో కూల్చివేత చేపట్టామని ‘న్యూస్టుడే’కు చెప్పారు. తనకు ఒక్కసారి కూడా నోటీసివ్వలేదని, మంగళవారం ఉదయం కూల్చివేతకు ముందు దుకాణం గోడకు అతికించారని శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ స్థలాన్ని తాను చీపురుపల్లి శ్రీనివాసరావు వద్ద కొన్నానని, అప్పటికే నలుగురైదుగురి చేతులు మారిందని, అక్రమ కట్టడమైతే పంచాయతీ పన్ను, విద్యుత్తు కనెక్షన్ ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!