బాబాయిని కలిసిన అబ్బాయి
పార్టీని చీల్చి మహారాష్ట్ర భాజపా కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరిన అజిత్ పవార్ ఆదివారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిశారు.
పార్టీని ఐక్యంగా ఉంచాలని అజిత్ విజ్ఞప్తి
మౌనంగా చెప్పింది విన్న శరద్ పవార్
ముంబయి: పార్టీని చీల్చి మహారాష్ట్ర భాజపా కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరిన అజిత్ పవార్ ఆదివారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కలిశారు. ఆయన వెంట మంత్రులుగా చేరిన వారూ ఉన్నారు. పార్టీని ఐక్యంగా ఉంచాలని తన బాబాయిని అజిత్ కోరారని పార్టీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. ఆయన చెప్పింది శరద్ పవార్ మౌనంగా విన్నారని, ఎటువంటి స్పందనా వ్యక్తం చేయలేదని తెలిపారు. బాబాయితో విభేదించి ఈ నెల 2వ తేదీన మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరిన సంగతి తెలిసిందే. ఆ తరువాత శరద్ పవార్తో అజిత్ భేటీ కావడం ఇదే తొలిసారి. పవార్ను కలిసిన వారిలో మంత్రులు హసన్ ముష్రిఫ్, ఛగన్ భుజ్బల్, అదితి తత్కారే, దిలీప్ వాల్సే ఉన్నారు. శరద్ వర్గం నేతలు జయంత్ పాటిల్, జితేంద్ర అవధ్ కూడా వచ్చారు. సమావేశానంతరం అజిత్ వర్గం నేత, రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్ విలేకరులతో మాట్లాడారు. ‘అపాయింట్మెంట్ లేకుండానే వచ్చి కలిశాం. పార్టీని ఐక్యంగా ఉంచాలని పవార్కు విజ్ఞప్తి చేశాం. రానున్న రోజుల్లో తమ గురించి ఆలోచించాలని, గైడ్ చేయాలని కోరాం. ఆయన మౌనంగా విని స్పందించలేదు’ అని వివరించారు. శుక్రవారం శరద్ సతీమణి ప్రతిభా పవార్ను వారి ఇంట్లో అజిత్ పరామర్శించారు. ఆమెకు శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. 2019లో ఫడణవీస్తో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ను మళ్లీ ఎన్సీపీలోకి ఆమే తీసుకొచ్చారని చెబుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణతో తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని హరియాణా మంత్రి కన్వర్పాల్ అన్నారు. -
రెట్టింపు మూల్యం చెల్లించుకోవడానికి వైకాపా నాయకులు ‘సిద్ధం’గా ఉండాలి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై దాడిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధాన పార్టీల కసరత్తు
రాష్ట్రంలో మరో ఎన్నికకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 27న జరిగే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కాంగ్రెస్, భారాస, భాజపాలు కసరత్తు వేగవంతం చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు