‘జమిలి’ అంటే అంత ఉలికిపాటెందుకు..!
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జమిలి ఎన్నికల విధానాన్ని ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తుండటంపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ మండిపడ్డారు.
విపక్షాలపై మంత్రి అనురాగ్ ఠాకుర్ ధ్వజం
శిమ్లా: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జమిలి ఎన్నికల విధానాన్ని ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తుండటంపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ మండిపడ్డారు. జమిలి ఉంటే ఉలికిపాటెందుకు అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా హిమాచల్ప్రదేశ్లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో అనురాగ్ ఠాకుర్ పాల్గొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’తో దేశం సమయం, డబ్బును ఆదా చేయాలని ఇండియా కూటమి కోరుకోవడంలేదు. ఎన్నికలు ఎదుర్కొనేందుకు భయపడుతున్నారు. విపక్ష కూటమి నేతలు నాలుగుసార్లు సమావేశమైనప్పటికీ ఒక నేతను గానీ, కన్వీనర్ను గానీ నియమించలేకపోయారు’’ అంటూ ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణతో తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని హరియాణా మంత్రి కన్వర్పాల్ అన్నారు. -
రెట్టింపు మూల్యం చెల్లించుకోవడానికి వైకాపా నాయకులు ‘సిద్ధం’గా ఉండాలి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై దాడిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధాన పార్టీల కసరత్తు
రాష్ట్రంలో మరో ఎన్నికకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 27న జరిగే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కాంగ్రెస్, భారాస, భాజపాలు కసరత్తు వేగవంతం చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM