Balakrishna: పవన్‌ కల్యాణ్‌ది.. నాదీ ఒకే మనస్తత్వం: బాలకృష్ణ

‘జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ది.. నాదీ ఒకే మనస్తత్వం. ముక్కుసూటిగా మాట్లాడటం, అవినీతికి పాల్పడిన వారిని నిలదీయడం’అని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.

Updated : 17 Nov 2023 07:20 IST

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: ‘జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ది.. నాదీ ఒకే మనస్తత్వం. ముక్కుసూటిగా మాట్లాడటం, అవినీతికి పాల్పడిన వారిని నిలదీయడం’అని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో గురువారం నిర్వహించిన తెదేపా, జనసేన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీతో కలవటం నవశకానికి నాంది అని పేర్కొన్నారు. కలసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని విమర్శించారు. అనంతరం హిందూపురం ప్రభుత్వాసుపత్రిని సందర్శించి, రోగులకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సీటీస్కాన్‌ పనిచేయకపోవటం, గైనకాలజిస్టులు 9 మందికి ముగ్గురే ఉండటం, తాను అందించిన వెంటిలేటర్లు వినియోగించకపోవటం, ఆసుపత్రి అపరిశుభ్రంగా ఉండటంపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తెదేపా పాలనలో రూ.23 కోట్లతో నిర్మించిన బసవతారకరామ మాతాశిశు ఆసుపత్రి వద్ద సెల్ఫీ తీసుకొని వైకాపా ప్రభుత్వానికి ఛాలెంజ్‌ విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని