వైకాపా నుంచి హేమాహేమీలు సంప్రదిస్తున్నారు: అచ్చెన్నాయుడు

వైకాపాను హేమాహేమీలు వీడనున్నారని, వారంతా తమను సంప్రదిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

Updated : 07 Jan 2024 13:40 IST

టెక్కలి, న్యూస్‌టుడే: వైకాపాను హేమాహేమీలు వీడనున్నారని, వారంతా తమను సంప్రదిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్మిక చైతన్యయాత్రను శనివారం ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆందోళన చేయని కార్మికుడు లేడని, వారందరికీ తెదేపా అండగా నిలుస్తుందని చెప్పారు. వారి సమస్యలను టీఎన్‌టీయూసీ బస్సుయాత్రలో తెలుసుకుని మానిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. వైకాపాలో చేరిన మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడిని ఐదు రోజులకే డకౌట్‌ చేశారని ఎద్దేవా చేశారు. టెక్కలి నుంచి కుప్పం వరకు 26రోజుల పాటు 92 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సుయాత్ర సాగుతుందని టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్సీ దువ్వూరి రామారావు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని