సిన్హాకు సంపూర్ణ మద్దతు: అక్బరుద్దీన్
యశ్వంత్ సిన్హాకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. సీఎం కేసీఆర్, తెరాస ప్రజాప్రతినిధులతో భేటీ అనంతరం సిన్హా.....
ఈనాడు, హైదరాబాద్: యశ్వంత్ సిన్హాకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. సీఎం కేసీఆర్, తెరాస ప్రజాప్రతినిధులతో భేటీ అనంతరం సిన్హా ఐటీసీ కాకతీయ హోటల్లో మజ్లిస్ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పరిచయం చేశారు. రాష్ట్రపతి పదవికి యశ్వంత్ అన్ని విధాలా అర్హులని.. తమ ఓట్లు ఆయనకే వేస్తామని చెప్పారు. బెంగళూరు బయల్దేరిన యశ్వంత్కు ‘బేగంపేట’లో మంత్రులు కేటీఆర్, తలసాని, మహమూద్ అలీలు వీడ్కోలు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434