రాష్ట్రాన్ని జగన్ దోచుకుంటున్నారు
రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి లిమిటెడ్గా మార్చి ముఖ్యమంత్రి దోచుకుంటున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. బీజేవైఎం ఆధ్వర్యంలో
బీజేవైఎం సంఘర్షణ యాత్రలో కన్నా ధ్వజం
కనిగిరి, న్యూస్టుడే: రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి లిమిటెడ్గా మార్చి ముఖ్యమంత్రి దోచుకుంటున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘర్షణ యాత్ర శనివారం ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణానికి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘పాదయాత్రలో మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్.. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. తల్లి, చెల్లిని గౌరవించని వ్యక్తి ప్రజలను ఏం గౌరవిస్తారు. కేంద్రం 130 సంక్షేమ పథకాలను రూపొందించి ఇస్తుంటే.. రాష్ట్రంలో వాటి పేర్లు మార్చి, ఆయనే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. లిక్కర్, మైనింగ్, ఇసుక, మట్టి ఇలా దేన్నీ వదలకుండా ప్రజా సంపదను లూటీ చేస్తున్నారు.కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు... రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనను ఎండగట్టేందుకు యాత్ర చేపట్టాం’’ అని తెలిపారు. భాజపా నాయకులు లంకా దినకర్, శ్రీనివాసరెడ్డి, జగన్, రాధాకృష్ణ, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434