రేపు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాలు: తెదేపా

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న(మంగళవారం) ఎన్టీఆర్‌ అమరజ్యోతి, లెజెండరీ రక్తదానం శిబిరం పేరుతో తెలంగాణవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పొలిట్‌బ్యూరో

Updated : 17 Jan 2022 06:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న(మంగళవారం) ఎన్టీఆర్‌ అమరజ్యోతి, లెజెండరీ రక్తదానం శిబిరం పేరుతో తెలంగాణవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డిలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలను కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ చేపట్టాలని వారు ఒక ప్రకటనలో సూచించారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద, ఎన్టీఆర్‌ భవన్‌లో, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించనున్నట్లు పార్టీ మీడియా కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని