నోటుతో పాటు ఓటూ వేయండి
ఉత్తర్ప్రదేశ్లోని ఫిరోజాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి రాందాస్ మానవ్ వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాడు. చేతులకు సంకెళ్లు వేసుకోవడంతో పాటు గిన్నెను పట్టుకొని ఓట్లు, నోట్లు
చేతికి సంకెళ్లతో ఫిరోజాబాద్ స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం
ఫిరోజాబాద్: ఉత్తర్ప్రదేశ్లోని ఫిరోజాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి రాందాస్ మానవ్ వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాడు. చేతులకు సంకెళ్లు వేసుకోవడంతో పాటు గిన్నెను పట్టుకొని ఓట్లు, నోట్లు అడుగుతూ ప్రచారం చేస్తున్నాడు. కూలీ కావడంతో ప్రచారం నిర్వహించేందుకు తన వద్ద డబ్బు లేదని.. అందుకే ఓట్లతో పాటు నోట్లు అడుగుతున్నానని రాందాస్ తెలిపారు. మూడోదశలో భాగంగా ఫిబ్రవరి 20 ఫిరోజాబాద్లో పోలింగ్ జరగనుంది. గాజుల వర్కర్ల యూనియన్ నేత అయిన రాందాస్.. గాజుల ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకే తాను ఎన్నికల బరిలోకి దిగినట్లు రాందాస్ పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?