Telangana News: శాసన మండలి ఛైర్మన్‌ పదవికి గుత్తా సుఖేందర్‌రెడ్డి నామినేషన్‌

శాసన మండలి ఛైర్మన్‌ పదవి కోసం తెరాస ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రులు

Updated : 13 Mar 2022 13:49 IST

హైదరాబాద్‌: శాసన మండలి ఛైర్మన్‌ పదవి కోసం తెరాస ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, సత్యవతి రాఠోడ్‌, జగదీష్‌రెడ్డి తదితరులతో కలిసి శాసనసభ సెక్రటరీకి నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ రెండోసారి శాసన మండలి ఛైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాన్ని కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన ఏకగ్రీవానికి సహకరించిన సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో మాదిరిగానే సభను హుందాగా నడిపించేందుక కృషి చేస్తానని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని