వైకాపా బెదిరించి గెలిచింది: పవన్‌

బెదిరింపులతోనే ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా ఎక్కువ స్థానాల్లో గెలిచిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని

Published : 14 Mar 2021 16:12 IST

హైదరాబాద్‌: బెదిరింపులతోనే ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా ఎక్కువ స్థానాల్లో గెలిచిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని ప్రజలను బెదిరించారని.. రేషన్‌కార్డులు, పింఛన్లు, విద్యాపథకాలు నిలిపివేస్తామని భయపెట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గుండెల్లో భరోసా నింపి వైకాపా ఓట్లు సాధించలేదని.. కడుపుమీద కొట్టి తిండి లాక్కుంటామని బెదిరించి ఆ పార్టీ గెలిచిందని పవన్‌ విమర్శించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని