154 స్థానాల్లో పోటీకి దిగనున్న కమల్ పార్టీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 154 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ప్రకటించారు. ఇండియా జననాయక కచ్చి, ఆలిండియా సమతువా మక్కల్ కచ్చి పార్టీలతో కలిసి బరిలో దిగుతున్నట్లు కమల్ వెల్లడించారు....
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 154 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ప్రకటించారు. ఇండియా జననాయక కచ్చి, ఆలిండియా సమతువా మక్కల్ కచ్చి పార్టీలతో కలిసి బరిలో దిగుతున్నట్లు కమల్ వెల్లడించారు. ఈ రెండు పార్టీలకు చెరో 40 స్థానాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
అటు డీఎంకే వరుసగా తన కూటమిలోని పార్టీలకు సీట్ల కేటాయింపుపై స్పష్టతనిస్తూ ముందుకుసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటు పూర్తి కాగా తాజాగా సీపీఎంకు ఆరు సీట్లను కేటాయించింది. దీనితోపాటు మరో మూడు స్థానిక పార్టీలకు ఒక్కో స్థానాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మూడు పార్టీలు డీఎంకే గుర్తుతోనే పోటీ చేస్తాయని పేర్కొంది.
మరోవైపు టీటీవీ దినకరణ్కు చెందిన అమ్మా మక్కమ్ మున్నేట్ర కజగం పార్టీతో ఎంఐఎం పొత్తు కుదుర్చుకుంది. పొత్తులో భాగంగా ఎంఐఎం పార్టీ తమిళనాడులో మూడు స్థానాల్లో పోటీకి దిగనుంది. వాణియంబాడి, శంకరాపురం, కృష్ణగిరిలో ఎంఐఎం బరిలో నిలువనున్నట్లు ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు వకీల్ అహ్మద్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.