Kishan Reddy: ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చూడాలి: రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ

భారత్‌ మాల, రీజినల్‌ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy).. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) లేఖ రాశారు.

Published : 24 Jan 2024 15:20 IST

హైదరాబాద్‌: భారత్‌ మాల, రీజినల్‌ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) భూసేకరణపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy).. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి (Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రోడ్లకు భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ కోసం నాయ్‌కు 50 శాతం నిధులు ఇవ్వాలన్నారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి భారాస ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని