రైతు సంక్షేమాన్ని విస్మరించి.. బంద్కు పిలుపా?
తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని విస్మరించిన తెరాస ప్రభుత్వం.. రైతు సంఘాల బంద్ను ప్రభుత్వ బంద్గా పిలుపునివ్వడం దురదృష్టకరమని
దిల్లీ: తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని విస్మరించిన తెరాస ప్రభుత్వం.. రైతు సంఘాల బంద్ను ప్రభుత్వ బంద్గా పిలుపునివ్వడం దురదృష్టకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. తెరాస తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ బంద్లో పాల్గొంటోందన్నారు. ఈ సర్కారీ బంద్ను ప్రతిఘటించాలని తెలంగాణ ప్రజలను కోరారు. రేపు రైతు సంఘాల బంద్ నేపథ్యంలో ఆ పార్టీ నేతలతో కలిసి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. అనేక రైతు నాయకుల డిమాండ్ మేరకే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని వివరించారు. ఇప్పుడు వాటిని రాజకీయ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. రైతుల ఆదాయం పెంచే చర్యలను నీరుగార్చేందుకు చూస్తున్నాయని ఆరోపించారు. మోదీ తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎరువుల కొరత లేకుండా చేశామని, ఎప్పుడూలేని రీతిలో మద్దతు ధర అందిస్తున్నామని చెప్పారు.
రైతుల కోసం కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పంటల బీమా పథకాన్ని కేసీఆర్ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. సన్నబియ్యం సాగు చేయాలంటూ రైతులను బెదిరించిన సీఎం కేసీఆర్.. పంట చేతికొచ్చాక కొనుగోలు విషయంలో చేతులెత్తేశారని కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే సన్నబియ్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నీ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. తెరాస తన స్వార్థ రాజకీయాల కోసం ఈ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ రాజకీయ ఉచ్చులో రైతులు పడొద్దని సూచించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
భారత్ బంద్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కొన్ని సూచనలు చేసింది. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం హోంశాఖ స్పష్టంచేసింది.
ఇవీ చదవండి..
ఆ నాలుగు గంటలే బంద్: రైతు సంఘాలు
పోలీసుల అదుపులో అఖిలేశ్ యాదవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.