KTR: విద్యాసంస్థల కేటాయింపుల్లో తెలంగాణ ఊసే లేదు: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వ విధానాలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు, కేటాయింపులపై ఆయన ట్వీట్ చేశారు. విద్యాసంస్థల

Updated : 20 Apr 2022 11:34 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ విధానాలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. విద్యాసంస్థల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మొండిచేయి చూపిందని ఇవాళ ట్విటర్‌లో మండిపడ్డారు. మోదీ సర్కారు ఏడు ఐఏఎంలను దేశవ్యాప్తంగా మంజూరు చేసినప్పటికీ తెలంగాణకు రిక్తహస్తం చూపిందన్నారు. ఏడు ఐఐటీల్లో రాష్ట్రానికి ఒక్కటి కూడా దక్కకపోవడం శోచనీయమన్నారు. మిగతా విద్యాసంస్థల కేటాయింపుల్లోనూ తెలంగాణ ఊసే లేదని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

ఎన్‌ఐటీలు 4, మెడికల్‌ కళాశాలలు 157, నవోదయాలు 84 వివిధ రాష్ట్రాలకు కేటాయించినప్పటికీ తెలంగాణకు చోటు ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రానికి గిరిజన విశ్వవిద్యాలయం హామీని విస్మరించారన్న మంత్రి.. తెలంగాణపై వివక్ష కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చిన సంప్రదాయ వైద్య కేంద్రం యథావిథిగా గుజరాత్‌కు తరలిపోయిందన్నారు. ఈ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో కిషన్‌రెడ్డి చేసిన ట్వీట్‌ను కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని