Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
మార్పులు చేర్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.. మనిషి ఆశాజీవి కదా! మార్పులు చేర్పులు జరిగితే బీఫామ్ తనకే వస్తుందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు.
స్టేషన్ ఘన్పూర్ (లింగాల ఘన్పూర్): కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్పులు చేర్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.. మనిషి ఆశాజీవి కదా! మార్పులు చేర్పులు జరిగితే బీఫామ్ తనకే వస్తుందని అన్నారు. భారాస ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన కడియం ప్రస్తుత ఎమ్మెల్యే కలసిపోయారనుకున్న తరుణంలో రాజయ్య వ్యాఖ్యలు మరోసారి సంచలన మయ్యాయి. జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలం వడ్డిచర్లలో ఆదివారం అంబేడ్కర్ విగ్రహావిష్కరణ అనంతరం రాజయ్య విలేకరులతో మాట్లాడారు.
అన్నీ ఊహాగానాలే.. ఏం జరగలేదు
‘‘కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య కలిసిపోయారు, మా పరిస్థితి ఏంటని రెండు మూడు రోజులుగా ప్రజాప్రతినిధులు నాయకులు అయోమయంలో ఉన్నారు. కానీ, అక్కడ ఏమీ జరగలేదు. కేటీఆర్కి నాకు మధ్య మాత్రమే సంభాషణ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పుడే నివేదికలు, సర్వే రిపోర్టుల ప్రకారం జాబితాలో చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పారు. ఇంకా బీఫాంలు కూడా ఇవ్వలేదు. కేటీఆర్ విదేశాలకు వెళ్లే ముందు స్వయంగా కలిసినప్పుడు గొప్పగా పని చేస్తున్నావు కేసీఆర్ మరో మారు నీకే అవకాశం కల్పిస్తారని చెప్పడంతో ఆగిపోయా. రెండ్రోజుల క్రితం కేటీఆర్ను కలిసినప్పుడు ఎమ్మెల్సీగా గానీ, ఎంపీగా గానీ అవకాశం ఉంటుందని, అప్పటివరకు వీలైతే రాష్ట్ర కార్పోరేషన్లలో నామినేటెడ్ పదవులు తీసుకోమని చెప్పారు. కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తీసిన ఫొటోలతో మీడియాలో ఊహగానాలతో వార్తలు రాశారు’’ అని రాజయ్య వివరించారు.
కలిసి పనిచేస్తానని ఎక్కడా చెప్పలేదు...
ఎక్కడా కూడా తాను శ్రీహరితో కలిసి పనిచేస్తానని చెప్పలేదని రాజయ్య అన్నారు. ఇటీవల మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం సమావేశంలో దామోదర రాజనర్సింహతో కలిసి పాల్గొన్నప్పుడు కూడా రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు రాశారని, ఇది కూడా అలాగే జరిగిందని గుర్తు చేశారు. తాను స్వయంగా విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడే ఏదైనా నిజమవుతుందన్నారు. 2014, 2018 ఎన్నికల్లో పార్టీ నిబంధనల ప్రకారం ఇద్దరం కలిసి పని చేశామన్నారు. 2023 ఎన్నికల్లో సైతం పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ అభద్రతా భావం ఉండదన్నారు. జనవరి 17 వరకు తానే ఎమ్మెల్యేగా ఉంటానని, ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!