Andhra News: 175 సీట్లు రావాలంటే వైకాపాలో ప్రక్షాళన జరగాలి: ఎంపీ రఘురామకృష్ణరాజు
రాష్ట్రంలో శాంతిభద్రతలు కల్పించలేని ప్రభుత్వం.. ప్రభుత్వమే కాదని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిత్యం ఎన్నో ఘోరాలు
దిల్లీ: రాష్ట్రంలో శాంతిభద్రతలు కల్పించలేని ప్రభుత్వం.. ప్రభుత్వమే కాదని నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిత్యం ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 3 హత్యలు.. 6 మానభంగాలు అని చెబుతుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లేని చట్టాల గురించి వైకాపా నేతలు మాట్లాడుతున్నారని రఘురామ విమర్శించారు.
‘‘ఏపీలో ఎక్కువ నేరాలు జరుగుతున్నట్లు క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదికలో వెల్లడైంది. మహిళలపై నేరాల్లో 2020లో ఏపీ 8వ స్థానంలో ఉంటే.. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఘటనల్లో 2వ స్థానంలో ఉంది. మహిళలపై భౌతికదాడుల విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. 2019తో పోల్చితే రాష్ట్రంలో నేరాల పెరుగుదల 63 శాతంగా నమోదైంది. ప్రతి 3 గంటలకు ఒక ఎస్సీపై దాడులు జరుగుతున్నాయి. 2021లో అత్యధిక లాకప్ డెత్లు ఏపీలోనే జరిగాయని.. అదృష్టం బాగుండి నేను బయటపడ్డాను. మద్య నిషేధంలో భాగంగా మా ప్రభుత్వం పర్మిట్ రూమ్లు తీసేసింది. 2, 3 రోజుల్లోగా చెదురుమదురుగా జీతాలు పడొచ్చని ఆర్థిక శాఖ అంటోందని జోక్ వచ్చింది. ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చినా రాష్ట్రం అప్పులు తీరవు. 175 సీట్లు వస్తాయని అంటున్నారు.. చివర ఉన్న 5 తీసేస్తే మనకు చాలా కష్టం. 175 సీట్లు రావాలంటే ప్రక్షాళన జరగాలి’’ అని రఘరామ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
చెస్లో అగ్రస్థానానికి పోటీ పడే ముందు రాహుల్ గాంధీ ముందు రాయ్బరేలీలో గెలవాలని చెస్ లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ సలహా ఇచ్చారు. ఓ యూజర్ పోస్టుకు ఆయన స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!