విశాఖ స్టీల్‌పై సుబ్రహ్మణ్యస్వామి ఏమన్నారంటే?

విశాఖ ఉక్కు కర్మాగారంపై భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలో సీఎం

Updated : 11 Mar 2021 14:04 IST

అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారంపై భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని.. దీన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అమరావతిలో సీఎం జగన్‌తో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణను తాను గతంలో వ్యతిరేకించానని గుర్తు చేశారు.

ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడం సరికాదని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ప్రతిదాన్నీ ప్రైవేటీకరించడం మంచిది కాదని.. బలమైన కారణాలుంటేనే అలా చేయాలన్నారు. ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చా? లేదా? అనేదాన్ని కేస్‌ బై కేస్‌ చూడాలని వ్యాఖ్యానించారు. తితిదేను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చాలన్నారు. తితిదే ఖాతాలను కాగ్‌తో ఆడిట్‌ చేయించాలన్న సీఎం జగన్‌ నిర్ణయం బాగుందని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. తితిదేను భక్తులే నడిపించేలా తీర్చిదిద్దాలన్నారు. పెట్రో ధరల పెరుగుదల ప్రజలకు భారంగా మారిందని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని