Nara Lokesh: అభివృద్ధి చేయని ముఖ్యమంత్రుల జాబితాలో జగన్‌ది మొదటి స్థానం: లోకేశ్‌

సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

Updated : 07 Apr 2024 12:14 IST

అమరావతి: సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధిని గాలికి వదిలేసి అప్పులకుప్పగా మార్చారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాలనుకొండలోని ఆర్ఆర్ అపార్టుమెంట్‌ వాసులతో సమావేశమై మాట్లాడారు. అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా హయాంలో సుమారు 72 శాతం పోలవరం పనులను చేస్తే వాటిని ఇంతవరకు పూర్తి చేయలేకపోయారని తెలిపారు. అసలు పనులు ఎలా సాగుతున్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు. ఉద్యోగుల సీపీఎస్‌, ఓపీఎస్‌పై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని.. తర్వాత వాటిపై మాట్లాడతామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ అందిస్తామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని లోకేశ్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని