Nara Lokesh: ఈ నెల 11 నుంచి లోకేశ్ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. ఉత్తరాంధ్ర నుంచి ‘శంఖారావం’ ప్రారంభం కానుందని, యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళికలు ఉంటాయన్నారు.
‘‘ప్రజలు, పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపడమే ‘శంఖారావం’ లక్ష్యం. రోజూ 3 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. సుమారు 50 రోజుల పాటు కొనసాగుతుంది. ఇచ్ఛాపురంలో ఈ నెల 11న తొలిసభ నిర్వహిస్తాం. జగన్ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పిస్తాం’’ అని అచ్చెన్న తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.