Nara Lokesh: ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి.. పేదలకు వైద్యం అందించండి: లోకేశ్
అస్తవ్యస్త పాలనతో సీఎం జగన్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని నారా లోకేశ్ విమర్శించారు.
అమరావతి: సీఎం జగన్.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు రూ.1200 కోట్లు బకాయి పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అస్తవ్యస్త పాలనతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని విమర్శించారు. సీఎం సొంత జిల్లా కడపలో సైతం ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలు నిలిపివేయడంతో పేదోళ్లకు వైద్యం గాల్లో దీపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బకాయిలు విడుదల చేసి సమస్యను పరిష్కరించడంలో చొరవచూపని ప్రభుత్వం.. ఆసుపత్రులను డీలిస్ట్ చేస్తూ బెదిరింపులకు దిగడం దారుణమని మండిపడ్డారు. అత్యవసరమైన వైద్య సేవల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయకులను బలిపశువులుగా మార్చొద్దని హితవు పలికారు. లక్షలాది పేద ప్రజల ఆరోగ్య సేవల విషయంలో మొండి వైఖరి వీడి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.