
NDA: ఎన్డీఏ@8ఏళ్లు.. 2014 తర్వాత ప్రభుత్వంపై పెరిగిన విశ్వాసం
స్వార్థపూరిత రాజకీయాలకోసం ప్రతిపక్షాల ఆరాటమన్న ప్రధాని మోదీ
జైపుర్: దేశవ్యాప్తంగా సంతులిత అభివృద్ధి, సామాజిక న్యాయంతోపాటు సామాజిక భద్రత కల్పించేందుకే భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంకితమయ్యిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అంతేకాకుండా 2014 తర్వాత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసం పునరుద్ధరించబడిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా జైపుర్లో నిర్వహించిన భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలు పేదలు, అణగారిన వర్గాల వారికి తప్పకుండా అందేటట్లు చూడాలని భాజపా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
‘ఈ నెలతో ఎన్డీఏ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటుంది. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నో తీర్మానాలు, విజయాలు సాధించాం. ప్రజలకు సేవ చేయడం, సుపరిపాలన, పేద ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేశాం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా సన్నకారు రైతులు, కార్మికులు, మధ్యతరగతి కుటుంబాల ఆశలు నెరవేరాయని అన్నారు. సంతులిత అభివృద్ధితో ముందుకెళ్తూనే సామాజిక న్యాయం, సామాజిక భద్రతతోపాటు మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన (2014) తర్వాత ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్నో అంచనాలతో యావత్ ప్రపంచం భారత్వైపే చూస్తుందన్న ఆయన.. దేశంలోని ప్రజలు కూడా భాజపా వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు. ఇలా దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు పెరగడంతో ప్రభుత్వం బాధ్యత కూడా మరింత పెరిగిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఇక స్వార్థపూరిత రాజకీయాలకోసం ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్న మోదీ, ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు చిన్న చిన్న సంఘటనల కోసం వెతుకుతున్నాయని ఆరోపించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh: అవన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి: నారా లోకేశ్
-
General News
TS Tenth Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు.. జిల్లాల వారీగా వివరాలివే..
-
Sports News
T20 World Cup: టీమ్ఇండియాకు షాకేనా..? టీ20 ప్రపంచకప్ జట్టులో షమి లేనట్టేనా..?
-
Movies News
NTR: కోమాలో అభిమాని.. ఫోన్ చేసి మాట్లాడిన తారక్
-
Politics News
Sanjay Raut: ఠాక్రేకు వెన్నుపోటు.. ఇదిగో ఇలాగే..!
-
General News
Ts Tenth Results: తెలంగాణ ‘పది’ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- 10th Results: కాసేపట్లో తెలంగాణ ‘టెన్త్’ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో చూడొచ్చు