Bihar: నీతీశ్, పీకే భేటీ.. అందుకోసమేనా..?
ఇటీవల కాలంలో బిహార్ రాజకీయాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
పట్నా: ఇటీవల కాలంలో బిహార్ రాజకీయాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) సమావేశం కావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపర్చింది. నీతీశ్పై విమర్శలు గుప్పించే ప్రశాంత్.. సీఎంతో రెండు గంటలపాటు సమావేశమయ్యారు. దాంతో ఆయన ప్రధాని మిషన్ను పూర్తి చేసేందుకే ఈ భేటీ జరిగిందా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమావేశంపై అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటనా రాలేదు.
ప్రశాంత్, నీతీశ్ మధ్య సమావేశం ఏర్పాటు చేసే విషయంలో జేడీయూ మాజీ ఎంపీ పవన్ వర్మ కీలకంగా వ్యవహరించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. ఈ భేటీకి ముందువరకూ జేడీయూ అగ్రనేతపై పీకే తీవ్ర పలుసార్లు విమర్శలు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ముఖ్యమంత్రి పీఠంపై నీతీశే ఉంటారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
నీతీశ్ ఇటీవలే భాజపాతో బంధం తెంచుకొని, తన ప్రత్యర్థి పార్టీ అయిన ఆర్జేడీతో దోస్తీ కట్టారు. ఇటు భాజపా, అటు ఆర్జేడీ పార్టీలకన్నా కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు వచ్చిన సీట్ల సంఖ్య తక్కువ. కానీ ఎవరితో పొత్తులో ఉన్నా.. ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం ఆయనే ఉంటున్నారు. అలాగే ఇటీవల కాలంలో ఆయన దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భేటీతో నీతీశ్ కల నెరవేర్చేందుకు కిశోర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి