T20 League: ధోనీ వద్దన్న పని చేసినందుకు చీవాట్లు పడ్డాయ్.. కానీ!
ఈశ్వర్ పాండే.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టలేదు కానీ భారత టీ20 లీగ్లో చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టీ20 లీగ్లో 2013-15 మధ్య 25 మ్యాచ్లు ఆడిన..
ఆనాటి సంఘటనను గుర్తు చేసుకొన్న చెన్నై బౌలర్
అన్క్యాప్డ్ ప్లేయర్గానే క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికిన ఈశ్వర్ పాండే
(ఫొటోసోర్స్: ఈశ్వర్పాండే ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: ఈశ్వర్ పాండే.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టలేదు కానీ భారత టీ20 లీగ్లో చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టీ20 లీగ్లో 2013-15 మధ్య కాలంలో 25 మ్యాచ్లు ఆడిన పాండే 18 వికెట్లు తీశాడు. 75 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 263 వికెట్లు పడగొట్టాడు. అయితే జాతీయ జట్టులోకి రావాలనే కోరిక మాత్రం నెరవేరలేదు. అన్క్యాప్డ్ ప్లేయర్గానే తన క్రికెట్ కెరీర్కు వీడ్కోలు చెప్పేశాడు. అయితే చెన్నై జట్టులో ధోనీ నాయకత్వాన ఆడినప్పుడు చోటు చేసుకున్న పలు విషయాలను వెల్లడించాడు. అప్పుడు భారత సారథిగా ఉన్న ధోనీ తనను జాతీయ జట్టులోకి తీసుకొని ఉంటే తన క్రికెట్ జీవితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అప్పుడు తన వయసు 23-24 మధ్యే ఉండటం, మంచి ఫిట్నెస్తో కలిగి ఉన్నట్లు వివరించాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉంటే కెరీర్ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లగలిగేవాడినని పేర్కొన్నాడు. అలాగే బెంగళూరుతో ఆడేటప్పుడు ధోనీతో జరిగిన సంఘటనను గుర్తు చేసుకొన్నాడు.
‘‘భారత టీ20 లీగ్లో భాగంగా ఓ సారి బెంగళూరుతో మ్యాచ్ ఆడేటప్పుడు ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్కు వచ్చాడు. అప్పుడు నాకు బంతిని అందిస్తూ ధోనీ ఓ మాట చెప్పాడు. ‘ఏబీడీకి యార్కర్ మాత్రం వేయొద్దు’ అని అన్నాడు. ఓ నాలుగు బంతులు కొట్టనీయకుండా బంతులను వేశా. కానీ ఐదోబంతిని యార్కర్గా ప్రయత్నించా. దానిని ఏబీడీ బౌండరీగా మార్చాడు. ఆ సందర్భంలో ధోనీ మళ్లీ నా దగ్గరకు వచ్చి సరదాగా చీవాట్లు పెట్టాడు. చివరి బాల్ను యార్కర్గా వేయొద్దన్నాడు. అయితే యార్కర్గా కాకుండా అది తక్కువ ఎత్తులో ఫుల్టాస్గా పడింది. ఆ బంతికి ఏబీడీ ఔటయ్యాడు’’ అని ఈశ్వర్ పాండే వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. -
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన