AAP: కాంగ్రెస్ ముక్కలుగా మిగిలిపోనుంది..ఆప్ వ్యంగ్యాస్త్రాలు..!
ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది భాజపాలో చేరడంతో బుధవారం గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
దిల్లీ: ‘దిల్లీ, పంజాబ్లో ఆపరేషన్ లోటస్ బెడిసికొట్టింది. కానీ గోవాలో విజయవంతమైంది. కారణమేంటంటే.. ఇప్పుడు మీరు కాంగ్రెస్కు ఓటు వేస్తే.. వారు తర్వాతి రోజుల్లో భాజపా ఎమ్మెల్యేగా మారిపోతారు. కాంగ్రెస్ పని అయిపోయింది. ఆ పార్టీ ముక్కలుగా మిగిలిపోనుంది(resting in pieces)’ అని ఆప్ నేత రాఘవ చద్దా ట్వీట్ చేశారు.
గోవాలోని కాంగ్రెస్కు చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది భాజపాలో చేరడంతో బుధవారం గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై హస్తం పార్టీని ఎద్దేవా చేస్తూ.. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ట్విటర్ వేదికగా స్పందించింది. అలాగే భాజపా వ్యవహరిస్తోన్న తీరును దుయ్యబట్టింది.
ఇదిలా ఉంటే.. పంజాబ్లో భగవంత్ మాన్ నేతృత్వంలో ఏర్పాటైన ఆప్ సర్కార్ను కూల్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేతలు నిన్న ఆరోపణలు చేశారు. దాదాపు 10 మంది ఆప్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున భాజపా నేతలు ఆఫర్ చేసినట్లు పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా వ్యాఖ్యలు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. భాజపా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, ప్రభుత్వాలను కూల్చివేస్తోందని దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!