Goa Congress: ‘భగవంతుడిని అడిగా.. నీ ఇష్టం అన్నారు’
పార్టీ మారబోమంటూ ఏడు నెలల క్రితం ఆలయం, చర్చి, మసీదులో ‘విధేయత ప్రతిజ్ఞ’ చేసిన ఎమ్మెల్యేలు నేడు భాజపాలో చేరిపోయారు. ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయించబోమంటూ..........
పనాజీ: పార్టీ మారబోమంటూ ఏడు నెలల క్రితం ‘విధేయత ప్రతిజ్ఞ’ చేసిన ఎమ్మెల్యేలు నేడు భాజపాలో చేరిపోయారు. ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయించబోమంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలోనే వారు ఈ ప్రతినబూనారు. కానీ ఏడు నెలలు గడవకముందే తమ ప్రతిజ్ఞను పక్కనబెడుతూ గోవా కాంగ్రెస్లోని 11మంది శాసనసభ్యుల్లో 8మంది పార్టీ మారిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో బుధవారం కాషాయ కండువా కప్పుకొన్నారు.
కాగా వీరిలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కూడా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ తతంగమంతా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ మారడంపై కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారేందుకు ‘దేవుడి అంగీకారం’ తీసుకున్నానని వ్యాఖ్యానించారు. తనతో సహా భాజపాలో చేరినవారంతా పార్టీ మార్పుపై ఆ భగవంతుడిని అడిగారని.. అందుకు దేవుడు అంగీకరించారని పేర్కొనడం గమనార్హం. ‘నేను భగవంతుడిని నమ్ముతా. ఎన్నికల ముందు కాంగ్రెస్ను వీడబోమని ప్రతిజ్ఞ చేసిన మాట వాస్తవమే. కానీ నేను మళ్లీ ఆలయానికి వెళ్లి ఏం చేయాలని భగవంతుడిని అడిగా. నీకు ఏది మంచిదో అది చేయమని దేవుడు నాకు చెప్పాడు’ అంటూ కామత్ విలేకర్ల ముందు పేర్కొన్నారు.
గత ఫిబ్రవరిలో గోవా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులంతా ‘విధేయత ప్రతిజ్ఞ’ (loyalty pledge) పేరుతో రాహుల్ గాంధీ సమక్షంలోనే ప్రతిజ్ఞ చేశారు. గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ను వీడబోమని, మరే ఇతర పార్టీలోనూ చేరబోమని ప్రతినబూనినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే సంకల్ప్ అమోంకర్ గతంలోనే వెల్లడించారు. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 40 స్థానాలకు గానూ భాజపా 20 సీట్లు దక్కించుకోగా.. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గడంతో మిత్రపక్షాలతో కలిసి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం
జనతాదళ్(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. -
కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం
కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా
రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేష్ లిలోతియా పిలుపునిచ్చారు. -
భారాసకు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ప్రకటించారు. శనివారం దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో నలుగురి నామినేషన్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు శనివారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. -
‘సెక్యులర్’ పదం తొలగింపు వ్యాఖ్యలపై మోదీ, అమిత్షా సమాధానం చెప్పాలి: జి.నిరంజన్
భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలు సమాధానం చెప్పాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి