Amit Shah: రామమందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు: అమిత్ షా
ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కలలు కంటుందని, అది ఎప్పటికీ జరగదని కేంద్ర హోంశాఖ మంత్రి, భాజపా అగ్రనేత అమిత్షా అన్నారు. ఉత్తరప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచాయి. ఈ క్రమంలోనే ఒరాయ్ నగరంలో
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కలలు కంటోందని, అది ఎప్పటికీ జరగదని కేంద్ర హోంశాఖ మంత్రి, భాజపా అగ్రనేత అమిత్షా అన్నారు. ఉత్తరప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచాయి. ఈ క్రమంలోనే ‘జన్ విశ్వాస్ యాత్ర’లో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అఖిలేశ్యాదవ్ తన పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపివేస్తానని అంటున్నారని, అది జరగని పని అని కేంద్రమంత్రి అన్నారు.
‘‘అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు. రాష్ట్రంలోని సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలు కులతత్వ పార్టీలు. మోదీజీ, యోగీ జీ మాత్రం ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్’ నినాదంతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పింది భాజపానే. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ 300కుపైగా సీట్లు గెలుస్తుంది’’అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.