Prathipati Pullarao: అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్‌ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు

జగన్‌ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.

Published : 19 Apr 2024 11:46 IST

అమరావతి: జగన్‌ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్‌ ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆరోపించారు. ఏపీలోని ప్రతి రైతు కుటుంబం నెత్తిన రూ.2.45 లక్షలకు పైగా అప్పు ఉందని చెప్పారు. తుపాన్లు, వరదలు, కరవు బాధితుల్లో కొద్దిమందికే పరిహారం అందించారన్నారు. సాగు భారమై, అప్పులు తీర్చే మార్గం లేకనే రైతులు బలవన్మరణాలు చేసుకుంటున్నారని వివరించారు. అంకెల గారడీలు, అబద్ధాలతో జగన్‌ బాధ్యత నుంచి తప్పించుకోలేరన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని