సీబీఐ, ఈడీ అధికారులేమైనా మీ కార్యకర్తలా?
అయోధ్య రామ మందిర ట్రస్ట్ కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలోని అక్రమాలపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
ముంబయి: అయోధ్య రామ మందిర ట్రస్ట్ కొనుగోలు చేసిన భూముల వ్యవహారంలోని అక్రమాలపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరపాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఆ రెండు దర్యాప్తు సంస్థలకు ఇది సరిపోయే కేసని చెప్పారు. ఆ భూములపై దర్యాప్తు కోసం భాజపా జాతీయ కమిటీ ఆ మేరకు తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మనీలాండరింగ్ ఆరోపణలపై రాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ నివాసాల్లో ఈడీ సోదాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, శివసేన మంత్రి అనిల్ పరబ్పై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయాలని మహారాష్ట్ర భాజపా కార్యవర్గం తీర్మానం చేయడంపై రౌత్ మండిపడ్డారు. ‘సీబీఐ, ఈడీ అధికారులు ఏమైనా మీ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారా? లేక మీ ఐటీ విభాగం సభ్యులు అనుకుంటున్నారా?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థల ప్రతిష్ఠను దిగజార్చుతూ.. ప్రత్యర్థులపై దాడులకు భాజపా ఆ సంస్థలను వినియోగించుకుంటోందని ఆరోపించారు. జాతీయ భద్రత, మనీలాండరింగ్, జాతీయ ఖజానాకు నష్టం వాటిల్లేలా చేసే అంశాలపై దర్యాప్తు చేయాల్సిన సంస్థలను ఇలా వాడుకోవడాన్ని ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుందని, ఎవరెన్ని కుతంత్రాలు చేసినా మరో మూడేళ్ల పాటు కొనసాగుతుందని రౌత్ ధీమా వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరుతూ భాజపా తీర్మానం చేసిన మరుసటి రోజే ఈడీ దాడులు జరగడం వింతగా ఉందని రాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాస్లే పాటిల్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM