Sonia Gandhi: మనందరి టార్గెట్ 2024.. విపక్ష నేతలతో భేటీలో సోనియా
వచ్చే సార్వత్రిక ఎన్నికలే మనందరి లక్ష్యం కావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అందుకోసం ప్రణాళికా బద్ధంగా పనిచేయాలన్నారు.
దిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలే మనందరి లక్ష్యం కావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అందుకోసం ప్రణాళికా బద్ధంగా పనిచేయాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే ఉద్దేశంతో 19 రాజకీయ పార్టీల నేతలతో శుక్రవారం సోనియా వర్చువల్గా సమావేశం నిర్వహించారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్ వంటి కీలక నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. టీఎంసీ, ఎన్సీపీ, డీఎంకే, శివసేన, జేఎంఎం, సీపీఐ, సీపీఎం, ఎన్సీ, ఆర్జేడీ, ఏఐయూడీఎఫ్, వీసీకే, లోక్తాంత్రిక్ జనతాదళ్, జేడీఎస్, ఆర్ఎల్డీ, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్ (మణి), పీడీపీ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, ఎస్పీ ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.
ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. మనందరి లక్ష్యం 2024 ఎన్నికలు కావాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య ఉద్యమ విలువలు.. రాజ్యాంగ సూత్రాలు, నియమాల పట్ల విశ్వాసం ఉంచే ప్రభుత్వాన్ని దేశానికి అందించాలన్న లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఒక విధంగా ఇది సవాల్తో కూడుకున్నదే అని అన్నారు. ప్రత్యామ్నాయం లేని స్థితిలో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పారు. దేశం కోసం ఒకే వేదికపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. భారత 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవ వేళ వ్యక్తిగతంగా, సమష్టిగా పునః పరిశీలనకు ఇదే సరైన సమయం అని చెప్పారు. కొవిడ్ వ్యాక్సినేషన్, ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, వ్యవసాయ చట్టాల వంటి అంశాలపై ఉమ్మడిగా ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే, ఓబీసీ బిల్లు విషయంలో అన్ని పార్టీలు ఒక్కటి తాటిపైకి వచ్చినట్లుగానే పార్లమెంట్ వెలుపల కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని సోనియా పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..