Telangana News: ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ భాజపా ఏటీఎంలా?: శ్రీనివాస్‌గౌడ్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనీస సంస్కారం లేకుండా వీధి రౌడీలా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. బండి సంజయ్

Published : 07 May 2022 01:28 IST

హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనీస సంస్కారం లేకుండా వీధి రౌడీలా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. బండి సంజయ్ కౌన్సిలర్ స్థాయికి కూడా పనికిరారని.. పాదయాత్రల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని పాదయాత్రలు మొదలుపెట్టి.. మతం, కులం పేరుతో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పచ్చటి పాలమూరును విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.20వేల కోట్లతో పూర్తయ్యేదని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కనీన పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తెరాసకు కాళేశ్వరం ఏటీఎం అయితే... ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ భాజపా ఏటీఎంలా? అని ప్రశ్నించారు. ఎల్ఐసీ, పవన్ హన్స్‌ సంస్థలకు ఎందుకు తక్కువ ధరకు అమ్మేశారు? అందులో ఎంత అవినీతి జరిగిందో భాజపా నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెరాస రజాకార్ల పార్టీ కాదని.. భాజపానే బందిపోట్లు, జేబుదొంగల పార్టీ అని శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని